A2Z सभी खबर सभी जिले की

లంచం తీసుకొంటూ ఎ.సి.బి. కి చిక్కిన స్టేట్ ట్యాక్స్ ఉద్యోగి

 

హైదారాబాద్ కు చెందిన ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ వ్యాపారి అయిన విశ్వేశ్వర్ విశ్వనాథ్ అనే అతను ఇటీవల హైదరాబాద్ నుండి విశాఖపట్నం నకు ప్లేవుడ్ షీట్స్ ను సరఫరా చేసినారు. అయితే, స్టేట్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, అచ్యుతాపురం సర్కిల్, డివిజన్ II, విశాఖపట్నంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేయుచున్న శ్రీమతి కిముడు జయలక్ష్మి, సదరు మెటీరియల్ ను క్యారింగ్ ఇన్వాయిస్ లేకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ విశాఖపట్నంలో వాటిని స్వాధీన పరచుకొని, విశాఖపట్నంలోని శ్రీ కాళేశ్వరి పార్సిల్ సర్వీసు ఆఫీసులో వాటిని వుంచి, సదరు వ్యాపారిని స్వాధీనం చేసుకొన్న మెటీరియల్ మీద ఎలాంటి తదుపరి చర్య తీసుకొనకుండా, రిలీజ్ చేయడానికి గాను రూ.25,000/- లంచంగా డిమాండు చేసినారు. అయితే బాధితుడు విశ్వేశ్వర విశ్వనాథ్ కు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక విశాఖపట్నం ఎ.సి.బి అధికారులకు సదరు అధికారిణి పై ఫిర్యాదు చేసినాడు. విశాఖపట్నం ఎ.సి.బి అధికారులు, దానిని వారి . 2. 3/RCT-ACB-VSP/2025, 2 2 (2) – 2018 25 7 కేసుగా నమోదు చేసి, సదరు అధికారిణి ఆ లంచం డబ్బులను శ్రీ కాళేశ్వరి పార్సిల్ సర్వీసు ఇంచార్జ్ అయిన మామిడిపాక సన్యాసి రాజు ద్వారా, బాధితుని వద్ద నుండి ఈ రోజు అనగా తేది. 30.05.2025 నాడు, తీసుకొంటుండగా, వారివురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు.
అరెస్టు కాబడిన ఆ ఇద్దరినీ శనివారం నాడు విశాఖపట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం డబ్బుల కొరకు ఎవరినైనా వేధించినట్లయితే, సంబంధిత స్థానిక ACB అధికారులకు గాని లేదా ACB టోల్ ఫ్రీ నెంబర్ 1064కు గాని లేదా ACB మొబైల్ నంబర్ 94404 40057 కు గాని లేదా ACB email ID complaints-acb @gov.in కి కు కానీ తెలియపరచవచ్చు.

ప్రజా పౌర సంభందాల అధికారి, ప్రధాన కార్యాలయం, అవినీతి నిరోధక శాఖ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ.

Related Articles
Back to top button
error: Content is protected !!